నిజంనిప్పులాంటిది

May 25 2023, 10:44

ముంబై ని ఒంటి చేత్తో గెలిపించాడు : ఎవరి ఆకాష్

ప్లే ఆఫ్స్ లో ముంబయి ఇండియన్స్. లక్నో జట్టుతో ఎలిమినేటర్ మ్యాచ్. దీంతో చాలామంది ముంబయి గెలుస్తుందని అనుకున్నారు. అనుహ్యంగా టాపార్డర్ సాధారణ స్కోర్లకే పరిమితమైంది. నవీన్ ఉల్ హక్ ఏకంగా 4 వికెట్లు తీశాడు. అయినాసరే ముంబయి ఎలాగోలా 182/8 స్కోరు చేసింది. ఒక్కసారి కుదురుకుంటే లక్నోకి ఈ టార్గెట్ పెద్ద కష్టం కాదని అందరూ అనుకున్నారు. సరిగా ఇలాంటి టైంలో ఓ కుర్రాడు మాయ చేశాడు. రోహిత్, సూర్య, తిలక్ వర్మ కాదు.. తానున్నానంటూ బులెట్ లాంటి బంతులేశాడు. సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్ ని గెలిపించాడు. ముంబయి క్వాలిఫయర్-2కి వెళ్లేలా చేశాడు. అసలు ఎవరీ కుర్రాడు? ఇతడికి రిషభ్ పంత్, బుమ్రాతో సంబంధమేంటి?

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈసారి ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా బాగానే ఉన్నా బౌలింగ్ మాత్రం తేలిపోయింది. బుమ్రా లేడు. ఆర్చర్ వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. అతడి స్థానంలో వచ్చిన జోర్డాన్ కూడా పరుగులిచ్చేస్తున్నాడు. దీంతో ఎలిమినేటర్ మ్యాచ్ లోనూ బౌలింగ్ కష్టమే అనుకున్నారు. ఇలాంటి టైంలో ఆకాష్ మద్వాల్ తన సత్తా చాటాడు. రెండేళ్లుగా జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒక్క ఇన్నింగ్స్ తో నిలబెట్టాడు. అసలు ఎవరీ కుర్రాడు అనుకోవచ్చు. చెప్పాలంటే ఈ సీజన్ లో ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే పంజాబ్ ని ఆ జట్టు సొంతగడ్డపై కట్టడి చేశాడు. ఆర్సీబీతో మ్యాచ్ లోనూ సేమ్ ఇలానే అడ్డుకున్నాడు. ఈ రెండింటిలోనూ ముంబయి బ్యాటర్లు ఛేజ్ చేసి గెలవడంతో ఆకాష్ కి పెద్దగా పేరు రాలేదు. లక్నో మ్యాచ్ లో మాత్రం అలా జరగలేదు.

ఈ మ్యాచ్ లో ముంబయి తొలుత బ్యాటింగ్ చేసింది. నామమాత్ర స్కోరు చేసింది. దీంతో బౌలర్లపై భారం పడింది. దీంతో ఆకాష్ ఆ బాధ్యత తీసుకున్నాడు. బుమ్రా లేని లోటుని పూడ్చేశాడు. లక్నో జట్టులో ఫామ్ లో ఉన్న ఆయుష్ బదోని, నికోలస్ పూరన్ ని వరస బంతుల్లో ఔట్ చేశాడు. ఓవరాల్ గా 3.3 ఓవర్లలో కేవలం 5 పరుగులే ఇచ్చి, 5 వికెట్లు తీసి ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు.

అసలు మ్యాటర్ చెప్పలేదు.. పాయింట్ కి రా అని మీరు అనుకోవచ్చు. అక్కడికే వచ్చేస్తున్నాం. టెన్నిస్ బాల్ క్రికెట్ తో ఆకట్టుకున్న ఆకాష్ ని.. మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ తొలుత గుర్తించాడు. సరైన కోచింగ్ ఇచ్చాడు. అందివచ్చిన అవకాశాన్ని సరిగా యూజ్ చేసుకున్న ఇతడు.. పేస్ బౌలర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

కెరీర్ పరంగా క్రికెటర్ అయినప్పటికీ.. ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ పక్కింట్లోనే ఆకాష్ ఉండేది. వీళ్లిద్దరూ అవతార్ సింగ్ అనే వ్యక్తి దగ్గర క్రికెట్ కోచింగ్ తీసుకున్నారు. పంత్ దిల్లీకి మారిపోతే.. ఆకాష్ మాత్రం ఉత్తరాఖండ్ లోనే ఉండిపోయాడు. ఈ రాష్ట్రం నుంచి ఐపీఎల్ ఆడిన తొలి క్రికెటర్ ఆకాష్ కావడం మరో విశేషం. 2021లో ఆర్సీబీలో నెట్ బౌలర్ గా ఉన్న ఆకాష్ ని ఆ జట్టు గుర్తించలేకపోయింది. దీంతో 2022 వేలంలో ఇతడిని ఎవరూ తీసుకోలేదు. సూర్యకుమార్ గాయపడటంతో అతడి స్థానంలో ఆకాష్ మద్వాల్ ని జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్ లోనూ రూ.20 లక్షల బేస్ ప్రైజ్ కి అతడిని అట్టిపెట్టుకుంది. అలా పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మాత్రం మర్చిపోకుండా ఆకాష్.. ఇప్పుడు తన జట్టుకు సహాయపడ్డాడు. నెక్స్ట్ బుమ్రాగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. సో అదనమాట విషయం...

నిజంనిప్పులాంటిది

May 25 2023, 10:41

ఈ రోజే టీఎస్ లాసెట్, పీజీ ఎల్‌సెట్ 2023 ప్ర‌వేశ ప‌రీక్ష‌

టీఎస్ లాసెట్, పీజీ ఎల్‌సెట్‌-2023 ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను గురువారం 25 న నిర్వ‌హించనున్న‌ట్లు టీఎస్ లాసెట్ క‌న్వీన‌ర్ వెల్ల‌డించారు. ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్ర‌వేశాల నిమిత్తం ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

మూడేండ్ల లా డిగ్రీ కోర్సు విద్యార్థుల‌కు రెండు సెష‌న్ల‌లో నిర్వ‌హించ‌నున్నారు. మొద‌టి సెష‌న్‌ను ఉద‌యం 9:30 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు, రెండో సెష‌న్‌ను మ‌ధ్యాహ్నం 12:30 నుంచి 2 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

ఐదేండ్ల లా డిగ్రీ కోర్సు విద్యార్థుల‌కు మూడో సెష‌న్‌లో సాయంత్రం 4 నుంచి 5:30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించనున్నారు

మొద‌టి, రెండో సెష‌న్ల‌కు తెలంగాణ‌లో 60, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 4 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు.

మూడో సెష‌న్‌కు తెలంగాణ‌లో 41, ఏపీలో 4 కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. లాసెట్, పీజీ ఎల్‌సెట్‌కు 43,692 మంది హాజ‌రు కానున్నారు. మూడేండ్ల లా డిగ్రీ కోర్సుకు 31,485 మంది, ఐదేండ్ల లా డిగ్రీ కోర్సుల‌కు 8,858 మంది, ఎల్ఎల్ఎంకు 3,349 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

హాల్ టికెట్‌లో పొందుప‌రిచిన అంశాల‌ను ప్ర‌తి అభ్య‌ర్థి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని క‌న్వీన‌ర్ సూచించారు....

నిజంనిప్పులాంటిది

May 24 2023, 17:40

నీ అల్లుడు ఆంధ్ర వాడు కదా❓️ రేవంత్ రెడ్డి పై ఛార్మిల పైర్

 తన వల్ల ఎక్కడ ఉనికి పోతుందో అని అభద్రత భావంతో రేవంత్ రెడ్డి ఫీల్ అవుతున్నాడని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.

నాది ఆంధ్ర అని రేవంత్ రెడ్డి అంటున్నాడని తాను ఆంధ్రకు చెందిన వ్యక్తినే అయితే సోనియా గాంధీ ఎక్కడి వారని ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల.. సోనియా గాంధీ ఇటలికి చెందిన వ్యక్తి కాదా అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌టీపీ అని జై తెలంగాణ అనే హక్కు రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోడీ, సోనియాకు లేదన్నారు.

రేవంత్ రెడ్డి అల్లుడు కూడా ఆంధ్రా అని ఆ సంగతి ఆయన తెలుసుకోవాలన్నారు. దళితబంధు పథకంలో ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నిస్తే ప్రగతి భవన్ లోని కమీషన్ల డొంక కదులుతుందనే భయంతోనే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకోవడం లేదని ఆరోపించారు.

దళితబంధులో సొంత పార్టీ ఎమ్మెల్యేలే స్వహా చేశారని స్వయంగా సీఎం కేసీఆరే అంగీకరించారన్నారు. ఎమ్మెల్యేల అవినీతిపై ప్రశ్నిస్తే వారు తిరిగి తన అవినీతిని ప్రశ్నిస్తారనే భయం కేసీఆర్ కు ఉందేమో అని ఎద్దేవా చేశారు. ఇంతటి అవినీతి జరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు..

నిజంనిప్పులాంటిది

May 24 2023, 17:18

Hyderabad: మొండెం లేని మహిళ తల ఎవరిదో తెలిసింది..

హైదరాబాద్‌: మలక్‌పేట్‌ పరిధిలో మహిళ హత్య కేసులో దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. తీగలగూడ వద్ద మొండెం లేని తల కేసులో మృతురాలు కేర్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు అనురాధగా గుర్తించారు.

అనురాధ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు బంధువులు వెల్లడించారు.

నగదు లావాదేవీల విషయంలోనే హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలిని శరీరాన్ని ముక్కలుగా చేసిన హంతుకుడు ఫ్రిడ్జ్‌లో దాచాడు.

చైతన్యపురిలోని హంతకుడు చంద్రమోహన్ ఇంటిలో దాచిపెట్టిన శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు.

కాగా, మలక్‌పేట్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తీగల గూడ మూసి పరివాహక ప్రాంతంలో ఒక నల్లటి కవర్‌లో గుర్తు తెలియని మహిళ తల లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు.. మలక్‌పేట్‌ పోలీసులకు సమాచారం అందించారు.

తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి ఆచూకీ కోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసి, మహిళ తలతో పోస్టర్లను ముద్రించి.. వీధుల్లో తిరుగుతూ ఆచూకీ కోసం ఆరా తీశారు.

నిజంనిప్పులాంటిది

May 24 2023, 17:16

Sangareddy: ప్రేమించడం లేదని యువతిపై బ్లేడ్‌తో దాడి

సంగారెడ్డి అర్బన్‌: సంగారెడ్డిలో యువతిపై ఓ యువకుడు బ్లేడ్‌తో దాడి చేశాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మనూరు మండలం తిమ్మాపూర్‌కు చెందిన తెనుగు అఖిల(21), నారాయణఖేడ్‌ పరిధిలోని పోతంపల్లికి చెందిన ప్రవీణ్‌కుమార్‌ (22)కు వరుసకు కోడలు అవుతుంది.

యువతి ఈరోజు సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు రాసేందుకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ప్రవీణ్‌ కళాశాల ఆవరణలోనే తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో యువతి మెడ, చేతులపై దాడి చేశారు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. తోటివిద్యార్థులు అప్రమత్తమై ప్రవీణ్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

ప్రాథమిక చికిత్స అనంతరం అఖిల పరీక్ష రాసింది. అనంతరం పోలీసులు ఆమె పట్టణ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. తనను ప్రేమించడంలేదనే అక్కసుతోనే యువతిపై ప్రవీణ్‌ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు..

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 24 2023, 17:13

Satya kumar: 'కోడికత్తి' తరహాలో అవినాష్‌రెడ్డి డ్రామా: భాజపా నేత సత్యకుమార్‌

తిరుపతి: నాలుగేళ్లలో సీఎం జగన్‌ నమ్మకద్రోహంతో నయవంచక పాలన అందించారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ విమర్శించారు. రాజధాని అంశంతో పాటు రైతు భరోసా, పంటల బీమా, మద్దతు ధర, బిందు సేద్యం తదితర అంశాల్లో సీఎం మోసం చేశారని ఆరోపించారు..

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన విమర్శించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సత్యకుమార్‌ మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి.. దారిదోపిడీకి మించిపోయిందన్నారు.

పంచభూతాల్లో ఏ ఒక్కదాన్నీ వదలకుండా వైకాపా నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. 'కోడికత్తి' తరహాలో ఎంపీ అవినాష్‌రెడ్డి డ్రామా కొనసాగుతోందని ఎద్దేవా చేశారు.

''మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణకు అవినాష్‌రెడ్డి సహకరించడం లేదు. సీబీఐకి రాష్ట్ర పోలీసులు సహకరించకుండా వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి మంచిదికాదు.

అవినాష్‌ అరెస్ట్‌ ఖాయం. వైకాపాలో సంస్కారం లేని వ్యక్తులు భాజపాపై విమర్శలు చేస్తున్నారు. యువతకు మెగా డీఎస్సీ అని జగన్‌ నమ్మకద్రోహం చేశారు. రాష్ట్రంలో రీసర్వే పేరుతో అటవీ, వివాదాస్పద, ప్రభుత్వ భూములను గుర్

నిజంనిప్పులాంటిది

May 24 2023, 17:11

కల్తీ కనికట్టు కనిపెట్టేది : ఎవరు❓️

కల్తీ తిండిలో మనమే టాప్

సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిపోర్టులో వెల్లడి

రాష్ట్రంలో కల్తీ ఫుడ్ పెరిగిపోతున్నది. పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట నూనె, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్.. ఇట్ల ప్రతీది కల్తీ అవుతున్నది. ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టడంలో సర్కార్ విఫలమవుతున్నది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఫుడ్ సేఫ్టీ విషయంలో మన రాష్ట్రం చివర్లో ఉన్నది. ఫుడ్ సేఫ్టీలో 17 పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే 15వ స్థానానికి దిగజారింది. అంటే కల్తీ ఫుడ్ ఎక్కువున్న రాష్ట్రాల జాబితాలో టాప్ 3లో ఉన్నదన్నట్టు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇటీవల విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది.

దేశవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీపై సర్వే చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ.. పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా రిపోర్టులు ఇచ్చింది. పెద్ద రాష్ట్రాల జాబితాలో ఒడిశా, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల కంటే తెలంగాణలో ఫుడ్ కల్తీ ఎక్కువగా ఉన్నట్టు రిపోర్టులో తేలింది. మరోవైపు ఫుడ్ క్వాలిటీ చెకింగ్ లోనూ రాష్ట్రం వెనుకబడిందని వెల్లడైంది. కల్తీ ఫుడ్ ను అరికట్టేందుకు కఠిన చట్టం తీసుకొస్తామని గొప్పగా చెప్పిన సర్కార్.. ఆరేండ్లయితున్నా అందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఫుడ్ కల్తీపైనా ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కూడా కల్పించడం లేదు. మార్కెట్ లోకి విచ్చలవిడిగా వస్తున్న కల్తీ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసి జనం అనారోగ్యానికి గురవుతున్నారు. క్యాన్సర్, గుండె, కిడ్నీ, లివర్ తదితర రోగాల బారినపడుతున్నారు.

ఫుడ్ క్వాలిటీ టెస్టుల్లేవ్..

ఫుడ్ క్వాలిటీ చెకింగ్ లోనూ మన రాష్ట్రం వెనుకబడింది. ఇందులో 20 పాయింట్లకు గాను తెలంగాణకు 3.5 పాయింట్లే వచ్చాయి. తమిళనాడుకు 10 పాయింట్లు, మిగిలిన రాష్ట్రాలు కూడా మంచి పాయింట్లతో ముందున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఫుడ్ క్వాలిటీ టెస్టులు చేయడం లేదు.

హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ నూనెలు వాడుతున్నారు. వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నారు. దీంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పెద్ద పెద్ద ప్రైవేట్ హోటళ్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. మాంసం విక్రయ కేంద్రాల్లోనూ క్వాలిటీ చెకింగ్ ఉండటం లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించే ఫుడ్ విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ప్రభుత్వ హాస్పిటళ్లలో పేషెంట్లకు అందిస్తున్న ఆహారం, పాలు, పండ్లు, గుడ్లు, ఇతర పదార్థాల నాణ్యతను పట్టించుకోవడం లేదు. గురుకుల హాస్టళ్లలోనూ తనిఖీలు చేపట్టడం లేదు. కల్తీ ఫుడ్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు తరచూ జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలోని స్లాటర్​హౌస్ కు ప్రభుత్వ గుర్తింపు ఉంది. ఇక్కడ రోజుకు 3 వేల గొర్రెలను కోస్తారు. ప్రతిరోజూ ఇక్కడ ర్యాండమ్ గా మాంసానికి క్వాలిటీ టెస్టులు చేయాలి. కానీ నామమాత్రంగానే టెస్టులు జరుగుతున్నట్లు చెబుతున్నారు...

నిజంనిప్పులాంటిది

May 24 2023, 17:03

Tirumala: తిరుమల ఘాట్‌ రోడ్డులో బస్సు బోల్తా

తిరుమల: తిరుమల నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్‌ బస్సు బుధవారం మధ్యాహ్నం బోల్తా పడింది. తిరుమల నుంచి వస్తుండగా.. మొదటి ఘాట్‌రోడ్డులోని 29, 30 మలుపు వద్దకు రాగానే డివైడర్‌ను ఢీకొన్న బస్సు లోయలోకి దూసుకెళ్లింది..

ప్రమాద సమయంలో బస్సులో 45 మంది భక్తులు ప్రయాణిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో విధులు ముగించుకొని అదే మార్గంలో వెళ్తున్న ఎస్పీఎఫ్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

వెంటనే ప్రమాదానికి గురైన బస్సు అద్దాలను ధ్వంసం చేసి భక్తులను కాపాడారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌, పలువురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాద ఘటనపై ఈవో ధర్మారెడ్డి విచారణకు ఆదేశించారు. ఆర్టీసీ ఎండీతో పాటు ఎలక్ట్రిక్‌ బస్సులు సరఫరా చేస్తున్న ఒలేక్ట్రా కంపెనీ ప్రతినిధులతోనూ ఈవో మాట్లాడారు.

ప్రస్తుతం తితిదే వద్ద 10, ఆర్టీసీ వద్ద 65 ఎలక్ట్రిక్‌ బస్సులు ఉన్న నేపథ్యంలో భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

నిజంనిప్పులాంటిది

May 24 2023, 17:00

మరో ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంకండి'

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అధిపతి టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసస్‌ కోవిడ్‌-19 మహమ్మారి కంటే ప్రాణాంతకమైన తదుపరి మహమ్మారి కోసం ప్రపంచం సిద్ధంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు.

గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ కోవిడ్‌-19 ముగింపు అంటే ప్రపంచ ఆరోగ్య ముప్పుగా ఉన్న కోవిడ్‌ 19కి ముగింపు కాదని టెడ్రోస్‌ చెప్పారు. సోమవారం జరిగిన 76వ ప్రపంచ ఆరోగ్య సభ్యకు తన నివేదికను సమర్పించిన సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ ఈ విషయాన్ని తెలిపారు.

వాస్తవానికి ఆ మహమ్మారి వ్యాప్తి చెందుతూ..తొలుత ప్రాణాంతకంగా మారిని తదనంతరం ఉనికిని వివిధ వేరియంట్లగా మార్చుకుంటూ మనం ఎదుర్కున్న తీవ్రత గల ముప్పుగా పరిణిమించలేదు.

అయినప్పటికీ ఇది అత్యవసర పరిస్థితులను పరిష్కరించి..సాధ్యమైనంత త్వరగా ప్రతిస్పందించేలా ప్రభావవంతమైన ప్రపంచ యంత్రాగాలు అవసరాన్ని గురించి నొక్కి చెప్పారు.

సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌(ఎస్‌డీజీలు) కింద ఆరోగ్య సంబంధిత లక్ష్యాలు 2030ని మరింతగా అమలు చేయాల్సిన ప్రాముఖ్యతను ఈ కోవిడ్‌ 19 మహమ్మారి తెలియజెప్పిందన్నారు.

నిజంనిప్పులాంటిది

May 24 2023, 16:59

New Parliament: కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంపై 19 విపక్ష పార్టీల కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: ఈనెల 28న జరగబోయే కొత్త పార్లమెంటు భవనం (New Parliament Buiding) ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు విపక్ష పార్టీలు ప్రకటించాయి..

రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి మోదీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని, పార్లమెంటుకు ఆత్మ వంటి ప్రజాస్వామ్యానికే చోటు లేనప్పుడు కొత్త భవనానికి ఇక ఎలాంటి విలువా లేదని పేర్కొంటూ 19 విపక్ష పార్టీలు (Opposition parties) బుధవారంనాడు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి..

19 పార్టీలు ఇవే...

కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బష్కరిస్తున్నట్టు ప్రకటించిన 19 పార్టీల్లో కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, జార్ఖాండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విడుదలై చిరుతైగళ్ కట్చి, రాష్ట్రీయ లోక్‌ దళ్, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), ఎన్‌సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఇండియన్ యూనయన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషరీ సోషలిస్ట్ పార్టీ, ఎండీఎంకే ఉన్నాయి..

SB NEWS

SB NEWS